ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఇవాళ(శనివారం) గచ్చిబౌలిలో ‘లెట్స్ ఓట్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం లాంటి ప్రలోభాలకు లొంగకుంటా అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు అధికారులు.
ఇది కూడా చదవండి: అమిత్ షా కాదు… అబద్దాల బాద్ షా