Monday, May 20, 2024

అమిత్ షా కాదు… అబద్దాల బాద్ షా

spot_img

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అమిత్ షా అన్నారని, ఎయిర్ ఇండియా వంటి పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తదట అని అన్నారు. అమిత్ షా ప్రకటన కనీసం నమ్మేటట్టు ఉందా అని అడిగారు. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు వచ్చాయని 16 ఏండ్ల మైనర్ ఆత్మహత్య

కోరుట్ల టౌన్‌లో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కవిత ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు బయటి వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని, తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు కవిత. తెలంగాణ కుటుంబంలోకి వచ్చి ఆ నాయకులు వైరుధ్యాలు సృష్టించలేరని, గొడవపెట్టలేరని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవని, గత పదేళ్లో ఎటాంటి అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా ? అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పింది ఎప్పుడూ చేయలేదని, కాబట్టి ఆ రెండు పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. వాట్సప్ లో ఆ పార్టీలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర పార్టీలు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతాయని, కానీ ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీతో నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ. 15 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. గతంలో ఇటువంటి మానవత కలిగిన ప్రభుత్వాలను చూశారా అని అడిగారు. కోరుట్లలో వెయ్యి ప్లాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి సంజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: బలిదానాల బాధ్యత కాంగ్రెస్‎దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనే

 

 

Latest News

More Articles