తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఆయా పార్టీలు తమ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో కీలక నేతల ప్రచారంతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లు కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ నిజామాబాద్, బోధన్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్, బోధన్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Read Also: ఇన్స్టా రీల్కు చెత్త కామెంట్లు వచ్చాయని 16 ఏండ్ల మైనర్ ఆత్మహత్య
పోస్టర్లపై రాహుల్, రేవంత్ చిత్రాలను ముద్రించి ‘మా పిల్లల చావుకు కాంగ్రెస్సే కారణం’ అని రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో చాలా మంది బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని, ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఉద్యోగాలు లేవని, యువత ఉరివేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసిన పాపానికి నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని పోస్టర్లలో ముద్రించారు. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అంటూ ప్రశ్నించారు.