Saturday, May 18, 2024

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‎కు ఐదోసారి నోటీసులు

spot_img

లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌‎కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Read Also: తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ భయపడరు.. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బొందపెడతాం

గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13న కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు.

Latest News

More Articles