న్యూఢిల్లీ: భర్తతో తన చెల్లికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అక్క అనుమానించి.. ఆమెపై గన్తో కాల్పులు జరిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమైల(20), తన అక్క సోనూ(30)తో కలిసి ఉంటున్నది. అయితే గత కొంతకాలంగా తన భర్త, సోదరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు సోనూ అనుమానించింది. ఇదే విషయంపై బుధవారం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో సోనూ తన సిస్టర్ పై కాల్పులు జరిపింది.
ఎలాగోలా తప్పించుకున్న సుమైల.. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కపై ఫిర్యాదు చేసింది. దీంతో సోనూపై హత్యాయత్నంతోపాటు ఆయుధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.