రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపు(శుక్రవారం) ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అంతేకాదు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట,మహబూబాబాద్, వనపర్తి,నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతారణ శాఖ తెలిపింది.