ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్పులు చేసింది. పోలింగ్ ఇవాళ(గురువారం) సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయవచ్చునని సీఈసీ తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో పోలింగ్ జరిగే రోజు(గురువారం) సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలపై నిషేదం విధించింది. తాజా ఉత్తర్వులతో ఎగ్జిట్ పోల్స్ పలితాను ఇవాళ సాయంత్రం 5.30 నుంచే ప్రసారం చేసేందుకు మీడియా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్