Sunday, May 19, 2024

అక్కడ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేసిన ఈసీ

spot_img

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి అక్కడ రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున డిసెంబర్ 3న కాకుండా డిసెంబర్ 4కు వాయిదా వేశారు. మిజోరాం ఎన్జీవో సమన్వయ కమిటీ సభ్యులతోపాటు పలు సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో వీటన్నింటిని భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. కౌంటింగ్ తేదీని సవరించి డిసెంబర్ 4కు(సోమవారం) వాయిదా వేసినట్టు వెల్లడించింది.

Read Also: సాగర్‎లో ఏపీ ప్రభుత్వం దుస్సహాసం చేసింది

ఎన్నికల కౌంటింగ్ తేదీని వాయిదా వేయాలంటూ మిజోరాం ఎన్జీవో సమన్వయ కమిటీ సభ్యులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దాంతో ఎన్నికల కమిషన్ ఈ వాయిదా నిర్ణయం తీసుకుంది.

Latest News

More Articles