Sunday, May 19, 2024

డీజీపీ అంజ‌నీకుమార్ స‌స్పెండ్

spot_img

హైదరాబాద్: డీజీపీ అంజని కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం స‌స్పెండ్ చేసింది. ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా డీజీపీతోపాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న త‌రుణంలో రేవంత్ రెడ్డి, ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌ను డిజిపి క‌ల‌వ‌డాన్ని ఎన్నిక‌ల సంఘం త‌ప్పు ప‌ట్టింది. దీంతో వెంట‌నే ఆయ‌నను విధుల నుంచి త‌ప్పించింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరిని డీజీపీగా నియమించాలని తన ఉత్తర్వులో ఆదేశించింది. అలాగే సంజయ్ కుమా జైన్, మహేష్ భగవత్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Latest News

More Articles