తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైన ఈ కౌంటింగ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్కు పంపినట్లు తెలుస్తుంది.