Sunday, May 19, 2024

గాంధీభవన్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కాంగ్రెసోళ్లు..!

spot_img

కాంగ్రెస్ అనగానే గుర్తుకువచ్చేది కొట్లాటలు,కుమ్ములాటలు. ఇవి అంతర్గాతంగా జరిగేవి కావు..బహిరంగంగానే కొట్టుకుంటారు. కుర్చీకోసం కొంతమంది నాయకులు కొట్టుకుంటే..మా ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు కొట్టుకుంటారు. నాయకుల ముందే రచ్చ రచ్చ చేస్తుంటారు. నాయకులేం తక్కువ కాదు గాంధీ భవన్ వేధికగా కొట్టుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి సీన్ మరోటి చోటుచేసుకుంది. గాంధీ భవన్ లో సోమవాన నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్ం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ పార్టీ అభ్యర్థి, నాయకులతో గాంధీభవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే కార్వాన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఉస్మాన్ బిన్ అల్ హజారీ తన కుమారుడిని వారించి అందర్నీ సముదాయించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: సన్ రైజర్స్ పై విరుచుకుపడ్డ సూర్య..ముంబై ఘన విజయం.!

Latest News

More Articles