కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరురుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడనాట 5.31 కోట్ల మంది ఓటర్లు మొత్తం 2,165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 72.36 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.