Sunday, April 28, 2024

ఐపీఎల్‌ 2023: బెంగళూరుపై ముంబై ఘన విజయం

spot_img

ఐపీఎల్‌ 2023లో ముంబయి ఇండియన్స్‌ ఆరో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆరో ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 68, కెప్టెన్‌ డుప్లెసిస్‌  65 ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. కోహ్లి (1) విఫలయం అయ్యాడు. దినేశ్‌ కార్తీక్‌ 30 రాణించగా.. కేదార్‌ జాదవ్‌ (12 నాటౌట్‌), హసరంగ (12 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. ముంబై బౌలర్లలో బెరెన్‌డార్ఫ్‌3, గ్రీన్‌, జోర్డాన్‌, కుమార్‌ కార్తికేయ ఒక్కో వికెట్ తీశారు.

అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ 83(35 బంతుల్లో 7×4, 6×6) వీరవిహారం చేశాడు. నేహల్‌ వధేరా 52 నాటౌట్‌( 34 బంతుల్లో 4×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ 42( 21 బంతుల్లో 4×4, 4×6) మెరవడంతో  భారీ లక్ష్యం చిన్నదైంది.  బెంగుళూరు బౌలర్లలో హసరంగ, వైశాఖ్‌ రెండేసి వికెట్లు తీశారు.

Latest News

More Articles