Friday, May 17, 2024

కేసీఆర్ సింహం లాంటోడు.. సింగల్ గా వస్తడు

spot_img

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం చేయాలన్న ఢిల్లీ పోవాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి వారు తెలంగాణకు అవసరం లేదని, తెలంగాణ గురించిన అణువణువు తెలిసిన కేసీఆర్ మనకున్నారని స్పష్టం చేశారు. ఒక్క కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు.. దేశ వ్యాప్తంగా నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. ఎందరొచ్చినా కేసీఆర్ సింగిల్ గా సింహంలా వస్తారని కేటీఆర్ తెలిపారు.

Also Read.. భ‌విష్య‌త్ తెలంగాణ నిర్మాత కేటీఆర్

బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ రాకేశ్ రెడ్డికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ అభ్య‌ర్థి క‌డియం శ్రీహ‌రి, జ‌న‌గాం అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్‌తో పాటు ప‌లువ‌రు నాయ‌కులు పాల్గొన్నారు.

Also Read.. మీరు అండగా నిలవండి.. మీకు అండగా నేను ఉంటా

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ లో ఐటీ కంపెనీ లు వచ్చాయన్నారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని, అవన్నీ మళ్ళీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి చూపిస్తామని తెలిపారు.  రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బీఆర్ఎస్ అమలు చేస్తున్న స్కీములు చేరాయన్నారు.  రాకేష్ లెక్కనే తాను ఆనాడు అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ కోసం పని చేయాలని వచ్చానని గుర్తుచేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ది చేశారని, అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే ఓటు వేస్తామని అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News

More Articles