Friday, May 3, 2024

కివీస్ కు భారీ షాక్.. పాక్ సెమీస్ ఆశలు సజీవం  

spot_img

వరల్డ్‌ కప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచి నిలిచింది. తొలుత బ్యాటింట్ చేసిన కివీస్‌ 402 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ఛేదన దిగిన పాక్ 25.3 ఓవర్లలోఒక వికెట్‌ నష్టపోయి 200 పరుగులు చేసింది.

Also Read.. తెలంగాణ, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో 9 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు

మ్యాచ్ కు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఇక రెండో సారి వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దుచేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) విధానంలో విజేతను నిర్ణయించారు. ఇందులో పాకిస్తాన్‌ 21 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.

Also Read.. ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సుల్లో ఎంట్రెన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌

పాక్ ఓపెనర్‌ ఫఖర్ జమాన్‌ (81 బంతుల్లో  126 నాటౌట్‌, 8 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు  సారథి బాబర్‌ ఆజమ్‌ (63 బంతుల్లో 66  నాటౌట్‌, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)  సమయోచిత ఇన్నింగ్స్‌తో  పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

Latest News

More Articles