Sunday, May 19, 2024

మళ్ళీ కాలుకు గజ్జె కడుతా.. అభివృద్ధి పాట పాడుతా

spot_img

ఏ పార్టీ అయినా.. ఏ జెండా అయిన ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ నేత ఏపూరి సోమన్న. తెలంగాణ భవన్ లో ఇవాళ(ఆదివారం) బీఆర్ఎస్ లో చేరారు ఏపూరి సోమన్న. గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపూరి.. నాకు ఒక లక్ష్యం ఉంది. ఈ భవన్ లో నేను అడుగు పెట్టక 10 ఏండ్లు అయ్యింది. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ తో ఉన్నారు.తెలంగాణ వచ్చే ముందే ఈ భవన్ కు దూరం అయ్యాం. ఇప్పడు నా ఇంటికి నేను వచ్చినట్లు ఉంది. పాట రోడ్ల మీద ఉండొద్దు చట్ట సభల్లోకి రావాలని సీఎం కేసీఆర్ చూశారన్నారు.

తెలంగాణ ఉద్యమం లో నా భాగం ఉందన్నారు ఏపూరి సోమన్న. బీఆర్ఎస్ కు కట్టుబడి పని చేస్తానని అన్నారు. మేము తిరిగిన పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. కేసీర్ దారి లో నడుస్తామని…మళ్ళీ కాలుకు గజ్జె కడుతా.. కేసిఆర్ పాట పాడుతూ.. అభివృద్ధి పాట పాడుతానని తెలిపారు ఏపూరి సోమన్న.

Latest News

More Articles