కర్ణాటకలో జేడీ (ఎస్) అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. జేడీ (ఎస్) ఉపాధ్యక్షుడైన సయ్యద్ షఫీవుల్లా పార్టీకి రాజీనామా చేశారు. కులాలు, వర్గాల మధ్య చీలికలు తెచ్చే పార్టీతో జేడీ(ఎస్) చేతులుకలిపిందని.. దీంతో ఇకపై పార్టీలో తాను కొనసాగడం కష్టమన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు జేడీ (ఎస్) ఇటీవల ఎన్డిఎ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పాలనలో నెలకొన్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు సయ్యద్ షఫీవుల్లా. దేశం అభివృద్ధి చెందాల్సిన మార్గం అది కాదని.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీతో లౌకిక శక్తులు ఏకీభవించలేవన్నారు. అలాంటి పార్టీలతో కొనసాగడం కష్టమన్నారు సయ్యద్ షఫీవుల్లా.