Saturday, May 18, 2024

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. ఎర్రబెల్లి ఎమోషనల్

spot_img

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, గెలుపు, ఓటములు సహజమని.. ప్రజా అవసరాలు తీర్చి, ప్రజల గుండెల్లో నిలవడం ముఖ్యమని అన్నారు. ప్రత్యేకంగా తనను మూడుసార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, తన కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరియు అభిమానులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles