Sunday, May 19, 2024

40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నా

spot_img

మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు . తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శరణ్‌ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందన్నారు. అతని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

విజయవాడకు చెందిన విజయ్‌ అనే ఎన్నారై దగ్గర శరణ్‌ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్‌ ఎవరో తనకు పరిచయం లేదని తెలిపారు ఎర్రబెల్లి. ఎన్నారైలు విజయ్‌ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాని తెలిపారు. శరణ్‌ చౌదరిపై అనేక చీటింగ్‌ కేసులు ఉన్నాయని, అతనితోపాటు ఆయన భార్య పాస్‌ పోర్ట్‌ కూడా పోలీసులు సీజ్‌ చేశారని చెప్పారు.

ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ విజయ్‌ పంపించిన వీడియోను మీడియాకు చూపించారు. తనకు ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఎలాంటి సంబంధం లేదని విజయ్‌ అన్నారు. రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టాలని శరణ్‌ చౌదరి కోరాడని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేశాడని చెప్పారు.

మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారని..ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వర్డ్ చేశారు అయినా నేను పార్టీ మారలేదని తెలిపారు మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓటు నోటుకు కేసు … నాకు ఎటువంటి సంబంధం లేదు. వార్త డైవర్ట్ అవుతోందన్నా ఆయన… ఓటుకు నోటు కేసు పై స్పదించనన్నారు.

ఇది కూడా చదవండి: కడిగిన ముత్యంలా బయటికి వస్తా

Latest News

More Articles