బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1924 జనవరి 24న బిహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. జనసేత ‘జననాయక్’గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్.. డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు రెండు సార్లు బీహార్ సీఎంగా సేవలు అందించారు.
Read Also: కస్టమర్లకు షాకివ్వబోతున్న స్విగ్గీ.. ఆర్డర్కు రూ. 10 వసూల్!