హైదరాబాద్: రెండు వారాలుగా రాయలసీమలో తిష్టవేసిన రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేసింది.