జగిత్యాల: బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుగ్గారం మండలం మద్దునూరు,శెకళ్ల గ్రామాల్లో ఐకెపి సెంటర్ పరిశీలనకు వెళ్లిన వివేక్ వెంకటస్వామిని అక్కడి రైతులు నిలదీశారు. రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్తుంటే కేంద్రం కొనబోమని చెప్పిందని, సమాధానం చెప్పాలని స్థానిక రైతులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వివేక్ మెల్లగా జారుకున్నారు.