బీహార్లోని ముజఫర్పూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల పిల్లలతో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. బోటులో ఉన్న చాలా మంది విద్యార్థులు గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది.
Massive accident in #Muzaffarpur, Bihar!
A boat carrying about 34 school-going children capsized in Bagmati river.
Around 20 kids have been rescued while many are still missing!!pic.twitter.com/sfKzVa3SDB
— NK 🇮🇳 (@nirmal_indian) September 14, 2023
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెనియాబాద్ ప్రాంతంలోని బాగ్మతి నదిలో పడవ బోల్తా పడింది. ఈ బోటు పిల్లలను స్కూల్కి దింపేందుకు వెళ్తోంది. బోటులో 34 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా మంది పిల్లలు తప్పిపోయారు. రెస్క్యూ టీం కొంతమంది విద్యార్థులను రక్షించింది. ఈ సంఘటన పోలీసులకు సమాచారం అందించడంతో స్థలానికి చేరుకున్నారు. చాలా మంది విద్యార్థుల జాడ తెలియలేదని రెస్య్కూ టీం చెబుతోంది. ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. నదిలో బలమైన ప్రవాహం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.