Friday, May 17, 2024

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

spot_img

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు డీసీఎం కంటైనర్ లు ఢీకొనడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి ఒక డీసీఎంలో మంటలు చెలరేగి, అందులోని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఫైర్ ఇంజిన్‎తో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఫోరెన్సిక్ సిబ్బంది చనిపోయిన వారి అవశేషాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles