ఫతేనగర్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి.. 10 మంది అస్వస్థతకు గురయ్యారు. బస్తీ సమీపంలోని ఓ కంపెనీలో కొన్నాళ్లుగా గ్యాస్ సిలిండర్లు వృథాగా పడి ఉన్నాయి. గమనించిన ఓ దొంగ.. సిలిండర్ల నుంచి ఇత్తడి వాల్వ్లు కొట్టేయడం కోసం రాడ్డుతో వాటిని కొట్టాడు. దాంతో ఒక్కసారిగా సిలిండర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైంది. గ్యాస్ లీక్ కావడంతో కంపెనీలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు0 అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు సమీపంలోని బస్తీవాసులు కూడా కళ్ల మంటలు, వాంతులతో ఇబ్బందిపడ్డారు. అస్వస్థతకు గురైన బాధితులను బాలానగర్లోని బీబీఆర్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.