Friday, May 17, 2024

బాలుడికి కరెంట్ షాక్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఏడుగురు మృతి

spot_img

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని కమాసిన్ రోడ్‌లోని బాబేరు కొత్వాలి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరెంటు షాక్‌కు గురైన బాలుడిని దవాఖానకు తీసుకెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారని పోలీసులు చెప్పారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం ధాటికి బొలేరో నుజ్జునుజ్జు అయిందని బాందా డీఎం దుర్గా శక్తి తెలిపారు.

Latest News

More Articles