తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నీలగిరిలో శనివారం టూరిస్ట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉంది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం ప్రకటించి ఆర్థిక సాయం ప్రకటించారు. మృతులు తెన్కాసి జిల్లా కడయం వాసులుగా గుర్తించారు. పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం కోయంబత్తూరుకు తరలించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అతివేగంతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ బస్సులో మొత్తం 59 మంది ప్రయాణికులు ఉన్నారు. కూనూరు నుంచి తెన్కాశికి బస్సు వెళ్తున్నట్లు సమాచారం. ఇంతలో ప్రమాదం జరిగింది.
#WATCH | 35 people were injured as a tourist bus fell into a gorge near Marapalam near Coonoor. 55 tourists were travelling in the bus going from Ooty to Mettupalayam. The injured have been sent to Coonoor government hospital for treatment. Further details awaited. pic.twitter.com/hQNygNfoGw
— ANI (@ANI) September 30, 2023
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సహాయ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని పర్యాటక శాఖ మంత్రి కె. రామచంద్రన్ను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.