చంద్రయాన్-3 మిషన్ విజయవంతం తర్వాత..ఇప్పుడు భారత అంతరిక్ష సంస్థ మరో పెద్ద విజయం సాధించింది. భారతదేశం యొక్క అంతరిక్ష ఆధారిత సౌర అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 భూమి యొక్క ప్రభావ పరిధి నుండి విజయవంతంగా బయటపడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం తెలిపింది. ఆదిత్య-ఎల్1 ఇప్పటి వరకు 9.2 లక్షల కి.మీలకు పైగా ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, ఆదిత్య-ఎల్1 ఇప్పుడు సూర్య-భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు పయనిస్తోందని వెల్లడించింది.
Aditya-L1 Mission:
🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth’s influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1).
🔸This is the second time in succession that…
— ISRO (@isro) September 30, 2023
ఇస్రో భూ ప్రభావ పరిధి వెలుపల అంతరిక్ష నౌకను పంపడం ఇది వరుసగా రెండోసారి. తొలిసారిగా మార్స్ ఆర్బిటర్ మిషన్ను భూ కక్ష్య వెలుపలికి పంపింది” అని ఇస్రో తెలిపింది. ఇస్రో ఒక వస్తువును మరొక ఖగోళ వస్తువు లేదా అంతరిక్షంలోకి విజయవంతంగా బదిలీ చేయడం ఇది వరుసగా ఐదవసారి. ఇస్రో మూడుసార్లు చంద్రుడిపైకి, ఒకసారి అంగారకుడిపైకి అంతరిక్ష నౌకను తరలించింది.
ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2న భారత రాకెట్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎక్స్ఎల్ (PSLV-XL) ద్వారా లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఇస్రో అంతరిక్ష నౌక కక్ష్యను నాలుగుసార్లు పెంచింది. భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం (SOI) నుండి నిష్క్రమించిన తర్వాత అంతరిక్ష నౌక లాగ్రాంజ్ పాయింట్ (L1) వైపు ప్రయాణిస్తున్నప్పుడు క్రూయిజ్ దశ ప్రారంభమవుతుంది. అప్పుడు, అది L1 చుట్టూ ఉన్న పెద్ద హాలో కక్ష్యలోకి ఇంజెక్ట్ అవుతుంది. లాంచ్ నుండి L1 వరకు మొత్తం ప్రయాణం ఆదిత్య-L1కి నాలుగు నెలల సమయం పడుతుంది. భూమి నుండి దూరం 1.5 మిలియన్ కిమీ ఉంటుంది.
కాగా ఆదిత్య ఎల్-1 అంతరిక్షం నుంచి డేటాను సేకరించడం ప్రారంభించిందని ఇస్రో ఇంతకుముందు తెలిపింది. ఆదిత్య L-1లో ఉన్న STEPS పరికరంలోని సెన్సార్లు భూమి నుండి 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సూపర్-థర్మల్, ఎనర్జిటిక్ అయాన్లు, ఎలక్ట్రాన్లను కొలవడం ప్రారంభించాయి. ఈ డేటా శాస్త్రవేత్తలకు భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఆదిత్య ఎల్1ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు ఎక్స్ఎల్ వెర్షన్ రాకెట్ని ఉపయోగించి ప్రయోగించారు.