Sunday, May 19, 2024

నల్లగొండలో ఘోరరోడ్డు ప్రమాదం..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురి మృతి..!!

spot_img

నల్లగొండ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. అద్దంకి, నార్కట్ పల్లి ప్రధాన రహదారిపై ఓ కారును గుర్తుతెలియను లారీ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కారు నుజ్జునుజ్జుయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

రెండు కుటుంబాలు కలిసి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే వెనక నుంచి ఓ లారీ దూసుకువచ్చంది. కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఓ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వద్ద జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకిచెందిన చెరుపల్లి మహేశ్ ఆయన భార్య జ్యోతి , వీరి కుమార్తే రిషితలతోపాటు మహేశ్ తోడల్లుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెంది భామ మహేందర్ ఆయన భార్య మాధవి, వీరి కుమారుడు లియాన్సీ లు కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాల్లో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై ఆఈ ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తేసిని ఐసీసీ

Latest News

More Articles