Saturday, May 18, 2024

శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తేసిని ఐసీసీ

spot_img

శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై విధించిన సస్పెన్షన్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్‌సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 2023లో శ్రీలంక క్రీడా శాఖలో రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్‌ని ఐసీసీ సస్పెండ్ చేసింది. భారతదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఫెయిల్యూర్ తర్వాత శ్రీలంక క్రికెట్‌పై ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇది ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐసీసీ బోర్డుకు చాలాసార్లు విజ్ఞప్తి చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి శ్రీలంకకు అనుమతించింది.

Read Also: కొడుకులు పట్టించుకోవట్లేదని ఆస్తిని పెంపుడు కుక్కలకు రాసిచ్చిన మాతృమూర్తి

Latest News

More Articles