Tuesday, May 21, 2024

చెప్పుల షాపులో అగ్నిప్రమాదం.. రూ. 25 లక్షల ఆస్తి నష్టం

spot_img

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలాజీ నగర్ ప్రధాన రహదారిలోని రామ చెప్పుల షాపులో గురువారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని సుధాకర్ తెలిపారు.

స్కూల్స్ ప్రారంభం కావడం వలన అధిక మొత్తంలో షాపులో స్టాకు తెచ్చి పెట్టామని, షార్ట్ సర్క్యూట్ వలన షాపు మొత్తం దగ్దమైందని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. పక్కనే ఉన్న షాపులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సకాలంలో మంటలను ఆర్పివేశారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Latest News

More Articles