Monday, May 20, 2024

డ‌బ్బుతో వెళుతున్న కారులో మంట‌లు… అందిన‌కాడికి దోచుకున్న జ‌నం

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ధనం చేతులు మారుతోంది. ఎన్నికల సంఘం, పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ విభాగాలు ఎంతగా నిఘా పెడుతున్నా కోట్లు సరిహద్దులు దాటుతోంది. తాజాగా ఓ పార్టీకి చెందిన నేత కూడా కారు ఇంజిన్‌లో కోట్లు పెట్టి తరలిస్తున్నాడు. అయితే ఇంజిన్ వేడి కావడంతో డబ్బులకు మంటలు అంటుకున్నాయి.

వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంటలోని వాగ్దేవి కాలేజీ ముందు ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి  పొగలు వస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అర్పివేసి ఇంజిన్‌లో చూడగా కట్టల కొద్దీ డబ్బు కనిపించింది. దీంతో ఎవరికి వారు దొరికినంత సొమ్మును జేబుల్లో పెట్టుకుని పరిగెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ కారు ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు. కారులో దాదాపు రూ.25 లక్షలు వుంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి: ఎన్నికలంటే ఐదు రోజుల పండగ కాదు.. ఐదు ఏండ్ల భవిష్యత్తు

Latest News

More Articles