హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ(మంగళవారం) ఉదయం నాచారం పారిశ్రామిక వాడలోని శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కెమికల్ మెటీరియల్ ఎక్కువ ఉండడంతో భారీగా మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్తో మంటలను అదుపు చేశారు.ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గో డౌన్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తుందా లేదా అనేది విచారణ చేస్తున్నామని…ఒకవేళ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాము ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కి ఇందిరమ్మ ఇండ్ల సెగ