బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. గృహజ్యోతి ప్రారంభానికి వెళ్లిన ఆయనను కొందరు మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం గృహజ్యోతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లులు అందజేశారు. ఆ తర్వాత సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముందుగా గ్రామపంచాయతీ కార్మికులకు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న కొందరు మహిళలు తమకు ఎప్పుడు ఇస్తారని గట్టిగా నిలదీశారు. వారిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇండ్లు లేని వారికి, ఇండ్లు కూలిపోయిన వారందరికీ తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: పోలీస్ శాఖలో బదిలీల గందరగోళం.. అధికారుల్లో అసహనం