రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఎవరు వచ్చినా ఎదుర్కొంటానని బీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బీఆర్ఎస్కే సానుకూలంగా ఉన్నాయన్నారు. మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. తాను పాతికేళ్లుగా ప్రజాసేవలో ఉన్నానని… ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేసినా తాను ఎదుర్కొంటానన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రజాసేవ ముఖ్యమన్నారు.
ఇది కూడా చదవండి: పోలీస్ శాఖలో బదిలీల గందరగోళం.. అధికారుల్లో అసహనం