Saturday, May 18, 2024

మహిళల ఐపీఎల్‌ జట్లను కొనుగోలుకు 5 ఫ్రాంచైజీలు

spot_img

ఈ ఏడాది2023 మార్చిలో నిర్వహించనున్న మహిళల ఐపీఎల్‌  కోసం బీసీసీఐ ఏర్పాట్లను చేపట్టింది.మొదట ఐదు జట్లతో ఈ లీగ్‌ను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఐదు ఫ్రాంచైజీల నుంచి టెండర్లను ఆహ్వానించింది. మహిళల జట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి  చూపించాయి. ప్రస్తుతం ఉన్న పది ఫ్రాంచైజీలలో ఐదు.. ఒక్కో టీమ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌,డిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ పంజాబ్‌ కింగ్స్‌  డబ్ల్యూఐపీఎల్‌పై ఆసక్తి చూపాయి. ఇప్పటికే సీఎస్‌కే ఆ దిశగా ఏర్పాట్లు మొదలుపెట్టింది.

Latest News

More Articles