రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిందౌన్ రోడ్డులో టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెంపోను ఓవర్ టెక్ చేసే సమయంలో బస్సు ఢీకొట్టినట్లు సమాచారం.
గాయపడిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్కు తరలించారు. కరౌలిలోని కైలా దేవి ఆలయాన్ని సందర్శించి టెంపోలో మెహ్వాకు వెళ్తున్న సమయంలో వస్తుండగా మహ్వా-హిందౌన్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. యాత్రికులందరూ కరౌలీలోని హిందౌన్ సిటీ నుంచి మెహ్వాకు టెంపోలో తిరిగి వస్తుండగా రాజస్థాన్ లోక్ పరివాహన్ సేవా బస్సు ఆటో రిక్షాను ఢీకొట్టిందని, దీంతో టెంపో నుజ్జునుజ్జు అయ్యిందని పోలీసులు తెలిపారు.