పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదని… ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 2014 కు ఇప్పటికి మహబూబ్ నగర్ అభివృద్ధిలో తేడాను గమనించాలని ప్రజలను కోరారు. ఇవాళ(ఆదివారం) మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి ఐటి కారిడార్ లో ముల్లర్ డాట్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో యూఎస్ అకౌంటింగ్ లో శిక్షణ పొందిన 140 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.త్వరలోనే జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఊహించని స్థాయిలో మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.