Sunday, May 19, 2024

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఎమ్మెల్యే బంధువులు మృతి

spot_img

హైద‌రాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. టెక్సాస్ హైవేలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదంలో ఏపీలోని అమ‌లాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు మరణించారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వార‌ని అమెరికా పోలీసులు తెలిపారు.

మృతుల‌ను ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ చిన్నాన్న కుటుంబంగా గుర్తించారు. పొన్నాడ నాగేశ్వ‌ర్ రావు,  ఆయన భార్య సీతామ‌హాల‌క్ష్మి, కుమార్తె న‌వీన గంగ‌, మ‌నుమ‌డు, మ‌నుమ‌రాలు మృతి చెందారు. పొన్నాడ నాగేశ్వ‌ర్ రావు అల్లుడు లోకేశ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

Latest News

More Articles