హైదరాబాద్: మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ కారు ఆపి బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న జీహెచ్ ఎంసి వాటర్ ట్యాంకర్,అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.