నిజామాబాద్ : బీఅర్ఎస్ పాలనలో అన్నిమతాలను ఒకే రీతిలో చూసామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పండగ సందర్భంగా ప్రభుత్వం తరపున కొత్త బట్టల పంపిణీ చేసే ఒరవడిని బీఆర్ఎస్ చేపట్టిందని పేర్కొన్నారు. సిరికొండ మండమ నర్సింగ్ పల్లిలో బీఅర్ఎస్ నాయకురాలు, మాజీ జెడ్పటీసీ ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో.. పాలనలో ప్రజలకోసమే పనిచేశామన్నారు. క్రిస్మస్ పండగ ఒక ఒక స్పూర్తి అన్న ఆమె, తెలంగాణలో ప్రతి ఒక్కరి మొఖంలో సంతోషం ఉండాలని ఆకాంక్షించారు.