జమ్ము కశ్మీర్ లోని రాజౌరీలో ఉగ్రదాడి నేపధ్యంలో బీజేపీపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో అమాయకులు చనిపోతే బీజేపీకి లబ్ధి చేకూరుతుందన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కాషాయ పార్టీ ప్రచారం సాగించడం, కశ్మీరీలను రాక్షసులుగా త్రీకరించడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు.
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించిన ఘటన నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేదానికి జవాబుదారీతనం కొరవడిందని అన్నారు. ఆర్మీయే దీనికి బాధ్యత వహించాలని రాజౌరిలో ప్రజలు చెబుతున్నారని తెలిపారు.
మరోవైపు సైన్యం తాము విచారణ జరుపుతామని చెబుతోందని అన్నారు. ఇక రాజోరి జిల్లాలోని డాంగ్రి గ్రామంలో సోమవారం జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు గాయపడ్డారు.