న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో వరుసగా విఫలమవుతున్నాడు భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్. ఐపీఎల్ 16వ సీజన్ 2023లో సెంచరీల మోత మెగించిన అతను కరీబియన్ గడ్డపై జోరు కొనసాగించలేక చతికిలపడ్డాడు.
ముఖ్యంగా టీ20 సిరీస్లో చెత్త ప్రదర్శనతో గిల్ జట్టుకు భారంగా మారాడు. ఈ రోజు కీలమైన నాలుగో టీ20 అమెరికాలో జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు శుభ్మన్ గిల్కు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఓ సలహా ఇచ్చాడు.
అన్ని పిచ్లు అహ్మదాబాద్లా ఉండవని, పరిస్థితులకు తగ్గట్టు ఆడడం అలవర్చుకోవాలని గిల్కు సలహా ఇచ్చాడు. వెస్టిండీస్ పిచ్లు స్లోగా ఉంటాయని, వచ్చీ రావడంతోనే హిట్టింగ్ చేయడం కుదరదని చెప్పాడు. తొలుత వేచి చూసి ఆడాలని సూచించాడు. పిచ్ తీరును అర్థం చేసుకుంటే ఆతర్వాత చెలరేగడం ఖాయం అని గిల్ కు మాజీ ఓపెనర్ సలహా ఇచ్చారు.
మరోవైపు ఈ సిరీస్ లో మూడో మ్యాచ్లో గెలిచిన టీమిండియా సిరీస్లో 1-2తో వెనకబడి ఉంది. అందుని ట్రోఫీ చేజారకూడదంటే హార్దిక్ పాండ్యా బృందానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం.