భారత క్రికెట్ దిగ్గజం ,95 ఏళ్ల మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ ఇవాళ(మంగళవారం) కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు దత్తాజీ రావ్ గైక్వాడ్. బరోడాలోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కెరీర్ లో 11 టెస్టులాడిన ఈ సీనియర్ గైక్వాడ్, 4 టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 52 పరుగులు. రంజీ ట్రోఫీలో 3,139 పరుగులు చేశారు. వాటిలో 14 సెంచరీలు ఉన్నాయి. దేశవాళీల్లో దత్తా గైక్వాడ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 249 పరుగులు. ఆయన బౌలర్ కూడా. దేశవాళీ పోటీల్లో 25 వికెట్లు పడగొట్టారు. 50వ దశకంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందారు.ఆయన కుమారుడు అంశుమన్ గైక్వాడ్ కూడా భారత్ తరపున క్రికెట్ ఆడారు.
ఇది కూడా చదవండి:బండిసంజయ్ అభద్రత భావంలో ఉన్నాడు