Saturday, May 4, 2024

బండిసంజయ్ అభద్రత భావంలో‌ ఉన్నాడు

spot_img

బండిసంజయ్ ఒక ఎంపీ గా ఉండి అబద్దాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.కాళేశ్వరం ‌ప్రాజెక్టు లో ఎల్ అండ్ టి ని బెదిరించి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు‌ అన్నాడు. ధైర్యం ఉంటే స్పష్టంగా బండిసంజయ్ అరోపణలు చేయాలన్నారు. సబ్ కాంట్రాక్టర్ ఎవరో‌ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బండిసంజయ్ ఐదేండ్లలో ఏనాడు అభివృద్ధి కి ఒక్క రూపాయి తేలేదు.వందరోజుల ఉపాధిహామీ నిధులని నేను తీసుకు వచ్చానని బండిసంజయ్ పాదయాత్ర లో చెబుతున్నారు. బీజేపీ ‌పార్టీ సిద్దాంతాలు పరిధిలో లేని వ్యక్తి బండిసంజయ్.అభద్రత భావంలో‌ ఉన్న బండికి.. ఓడిపోతానని అయనకి తెలుసునని అన్నారు.ఎల్ అండ్ టి సంస్థ సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వదు.ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వినోద్ కుమార్.

ఇది కూడా చదవండి: ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపై ఉంది

Latest News

More Articles