Sunday, May 19, 2024

కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు మోసపోయారు

spot_img

కార్యకర్తలు ఎంతో పట్టుదలతో జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించారని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి.. ప్రజల్లో అపోహలు కలిగించారన్నారు. ఇవాళ(బుధవారం) జనగామలోని ఉషోదయ ఫంక్షన్ హాల్ లో జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు. సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి..ఎన్టీఆర్ ను కూడా ప్రజలు ఓడించారు.. 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ను మళ్లీ గద్దె దింపి.. 250 సీట్లతో ఎన్టీఆర్ ను గెలిపించి ప్రతిపక్షం లేకుండా చేశారని తెలిపారు.మన పథకాలు దేశంలోనే అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. జనగామ, పాలకుర్తి కరువు పీడిత ప్రాంతాలు.. కేసీఆర్ అడిగినన్ని డబ్బులు ఇచ్చి రిజర్వాయర్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు మోసపోయారన్నారు. మన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు.. కార్యకర్తలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ సహించరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి.

ఇది కూడా చదవండి: బీసీలకు న్యాయం జరినప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయి

Latest News

More Articles