Wednesday, May 8, 2024

బీసీలకు న్యాయం జరినప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయి

spot_img

ఎప్పుడైతే బీసీలకు న్యాయం జరుగుతుందో అప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలవుతాయన్నారు ఎమ్మెల్సీ కవిత. 2006 నుండి ఇప్పటి వరకు జాగృతి స్థాపించినప్పుడు అనేక ఉద్యమాలు చేసామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగ గా గుర్తించాలని జాగృతి ఆధ్వర్యంలో పోరాడామన్నారు.

బీసీల సామాజిక విషయాలపై వికారాబాద్ లోని గౌలికర్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత.  ఆ తర్వాత మాట్లాడిన ఆమె..ఉమ్మడి రాష్ట్రంలోనే జాగృతి ఆద్వర్యంలో 20 వేల మంది కి ఉపాధి కల్పించామన్నారు. తెలంగాణ జాగృతి నుండి భారత జాగృతిగా మార్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం బీసీ లకు అనేక వాగ్దానాలు ఇచ్చారు… అవి ఏంటి అంటే ప్రతి సంవత్సరం బీసీ లకు 20 వేల కోట్లు బడ్జెట్ పెడతాం అని చెప్పిన్రు. రేపు ప్రారంభం అయే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత.

కులగణన 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పిన్రు. దీని ద్వారా 23 వేల 973 మందికి లోకల్ బాడి ఎన్నికల్లో గెలుస్తారని అంచనా వేశారు. కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు ముందుకు వెళ్లాలని మేము డిమాండు చేస్తున్నామన్నారు. యునైటెడ్ ఫూలే ఫ్రాంట్ & భారత జాగృతి ఆధ్వర్యంలో మూడు డిమాండ్లు చేస్తున్నామన్నారు కవిత..అసెంబ్లీ లో పూలె విగ్రహం పెట్టాలి…వెంటనే కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 20 వేల కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్నారు.

12 వ తేదీన ఇందిరా పార్కు లో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ధర్నాలో 5 రాష్ట్రాలకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొంటారని…తదుపరి కార్యాచరణ ధర్నా లో తెలియజేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. కొంత అవగాహనతో మనం చదివింది పది మందికి తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: ఆర్టీసి మనందరిది.. దానిని కాపాడుకోవాలి

Latest News

More Articles