Sunday, May 19, 2024

ఆర్టీసి మనందరిది.. దానిని కాపాడుకోవాలి

spot_img

ఆర్టీసి మనందరిది… దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య మనపై ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇవాళ(బుధవారం) కొండాపూర్  జరిగిన ఎనిమిదో బెటాలియన్ లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల  పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం..ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల  ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్ లకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ సంస్థను తిరిగి  తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కరోనా, సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందన్నారు.

నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని..ఇప్పటి వరకు 14న్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి  బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు ,నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు.ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఏండీ మార్గదర్శకంలో ముందుకు పోతున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలి.. దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో.. పేద  ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణ లో ఆర్టీసీ పాత్ర కీలకమైందన్నారు మంత్రి పొన్నం.

ఇది కూడా చదవండి:బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్…చివరి తేదీ రెండు రోజులే..!!

Latest News

More Articles