అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) ప్రజాభవన్కు వెళ్లారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా భవన్కు రోజూ వెళ్తానని చెప్పిన రేవంత్.. మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా లేవనెత్తామన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్లారని అన్నారు. ప్రజాభవన్కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఇవాళ చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారు కదా అని అన్నారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: హెచ్సీఏ హెడ్ కోచ్ జైసింహ సస్పెన్షన్