Monday, May 13, 2024

అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

spot_img

రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో కొండా మల్లయ్య గార్డెన్ లో బీఅర్ఎస్ కృతజ్ఞత సభలో సభలో మాట్లాడిన హరీశ్ రావు… ఈ ఎన్నికల్లో మొత్తంలో మనకు 1.8 శాతం మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు, 39 స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. చరిత్రలో దక్షిణ భారత దేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. మన పార్టీకి దళిత బంధు, బీసీ బందుతో పాటు గృహ లక్ష్మి పథకాలు ఇబ్బంది పెట్టాయని కార్యకర్తలు చెప్పారన్నారు. మన పథకాలు ప్రచారం చేయడంలో విపలమయ్యామని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మర్నాడే రెండు లక్షల రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నేటికీ కూడా రుణమాఫి ఉసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వేస్తే రైతుబందు డబ్బులను 15వేలకు పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు డబ్బులు పడకుండా ఆపారన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి రైతుబందు డబ్బులు పడలేదు అన్నోల్లను చెప్పుతో కొట్టుమని అన్నారు. ఇదేం పద్దతి, కాంగ్రెస్‌ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలి.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ?.బీఅర్ఎస్ కు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్తకాదని అన్నారు.

ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు.. ఈ లోగా  కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 1.50 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ వెంటనే 2,500 ఇవ్వాలన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా పారడం లేదన్నారు.. మరి మొన్న కొండా సురేఖ రంగనాయకసాగర్ గేట్లు ఎందుకు వదలారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్, బీజేపీ లు కావు.. బీఅర్ఎస్ మాత్రమే నన్న హరీశ్ రావు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ ఎంపీలు గట్టిగా గెలిస్తేనే , హామీల అమలుకు నిలదీయవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి.. శత్రువులుగా ఉండొద్దు

Latest News

More Articles